TS Leopard News : చిరుత చెట్టెక్కింది. శేషాచలం కొండల్లో కాదు. ఇది నిర్మల్ జిల్లాలో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లా పరిధిలోని విశ్వనాథ్ పేట, బంగల్పేట్ మార్గంలో కొందరు చిరుతను చూశారు. పంట పొలాల్లో తిరుగుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ఆ చిరుత చెట్టెక్కింది. కొందరు ధైర్యం చేసి వీడియో తీశారు.
చిరుత తిరుగుతుండటంలో పొలాల్లోకి వెళ్లాలంటే భయపడిపోతున్నారు స్థానికులు. అసలే వ్యవసాయ పనుల సీజన్. పొలానికి వెళ్లకుండా ఉండలేరు. వెళితే చిరుత ఎక్కడ దాడి చేస్తుందోననే భయం.
అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి.. ఆ చిరుతను బంధించాలని వేడుకుంటున్నారు ప్రజలు.