Hyderabad :హైదరాబాద్ అంబర్ పేటలో ఇద్దరి యువతులపై దాడి చేసిన మైనర్ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యానగర్ రైల్వే ట్రాక్ పై రాత్రి వేళ సూసైడ్ చేసుకున్నాడు. గురువారం ఇద్దరు యువతులపై ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు.
ట్యూషన్ నుంచి వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలను ప్రేమించమని వెంటపడి వేధించాడు. ఈ క్రమంలోనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన మరో అమ్మాయిపైనా అటాక్ చేశాడు. గాయపడ్డ యువతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భయపడి నిందితుడు అర్ధరాత్రి కాచిగూడ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు .
ఘటన తర్వాత భయాందోళనకు గురై ఇంట్లో తల్లి సెల్ ఫోన్ తీసుకువెళ్లాడు.రాత్రి 11:30 తర్వాత రైల్వే ట్రాక్ పై బాలుడు సూసైడ్ చేసుకున్నాడు . ఆత్మహత్య చేసుకున్న నిందితుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.