బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు ఫర్నిచర్ తరలిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండు డీసీఎం వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటీకి సామాగ్రిని తరలించారు. బీఆర్ఎస్ నాయకులు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
క్యాంపు కార్యాలయంలో తరలిస్తున్న ఫర్నిచర్ ను అడ్డుకోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలకు అక్కడ నిరోధ్ ప్యాకెట్లు కనిపించాయి. సుపరిపాలనకు వేధికగా ఉండాల్సిన క్యాంపు కార్యాలయంలో నిరోద్ ప్యాకెట్లు ఉండటాన్ని చూసి, కాంగ్రెస్ కార్యకర్తలు అవాక్కయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్నటి వరకు అసలేం జరిగిందన్న సందేహాలు వస్తున్నాయి.