NIA Raids in Hyderabad(Breaking news in telangana): హైదరాబాద్లోని పలుచోట్ల NIA సోదాలు జరుపుతోంది. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో దాడులు జరిపింది. హిమాయత్ నగర్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వేణుగోపాల్ విప్లవ రచయితల సంఘంలో సభ్యుడు, వరవరరావుకు అల్లుడు.
Read More : Dharani Scam : ధరణి పేరుతో 38వేల ఎకరాలు మాయం.. అవన్నీ ఎక్కడ ?
హిమాయత్ నగర్ లోని వేణుగోపాల్ ఇంట్లో, ఎల్ బీ నగర్లోని రవి శర్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కొంతకాలంగా మావోయిస్టులతో సంబంధాలున్న వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఎల్బీనగర్ లో ఉన్న రవిశర్మ ఇంటిలోనూ తనిఖీలు చేపట్టింది.