NIA Rides : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, కర్నూలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు తనిఖీలు చేశాయి. కరీంనగర్లోని తఫ్రీజ్ఖాన్ అనే వ్యక్తికి.. PFI నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తఫ్రీజ్ఖాన్ దుబాయ్లో ఉంటున్నారు. తఫ్రీజ్ఖాన్ ఉగ్రదాడులకు ఏమైనా ప్లాన్ చేశారా అనే సందేహాలతో విస్తృతంగా సోదాలు చేపట్టింది ఎన్ఐఏ టీమ్.
గురువారం తెల్లవారుజాము నుంచి కరీంనగర్లోని హుస్సేనీకూరలోని తఫ్రీజ్ఖాన్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
అటు, కర్నూలు పాతబస్తీలోనూ NIA సోదాలు చేసింది. PFIతో సంబంధాలున్నాయనే సమాచారంతో అబ్దుల్లా అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపారు.