Narayankhed : మరణం.. ఎప్పుడు.. ఎలా వస్తుందో చెప్పడం కష్టం. మీకు చూపించబోయేది ఇప్పుడు అలాంటి వీడియోనే. స్కూటీ నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు వచ్చి నడిరోడ్డుపైనే తనువు చాలించాడు. ఆసుపత్రి తీసుకెళ్లే సమయానికే మృతిచెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో జరిగింది.
51 సంవత్సరాల కడావత్ దూప్యా సింగ్ దామరగిద్దలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం కావడంతో పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురై స్పాట్ లోనే చనిపోయాడు. మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. దూప్యానాయక్ మృతితో ఆయన స్వగ్రామమైన పీర్లతండాలో విషాదచాయలు అలుముకున్నాయి.