Pallavi Prashanth : బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు బెయిలు మంజూరైంది. నాంపల్లి క్రిమనల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 15వేల పూచికత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని సూచించారు. అలాగే ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని చెప్పారు. విచారణకు పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం షరతులు విధించింది.
బిగ్ బాస్ టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. బుధవారం అతడి స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసిన పోలీసులు.. పల్లవి ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పీఎస్కు తరలించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు.
కాగా నిన్న పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. బిగ్బాస్ హౌస్లో ఉన్న ప్రశాంత్కు.. బయట ఏం జరుగుతున్నదో తెలీదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని వాదనలు వినిపించారు. అనంతరం, తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది నాంపల్లి న్యాయస్థానం.