EPAPER

Engineer Jagajyoti Case: లంచం కేసు.. జగజ్యోతికి 14 రోజుల రిమాండ్‌!

Engineer Jagajyoti Case: లంచం కేసు.. జగజ్యోతికి 14 రోజుల రిమాండ్‌!
ACB Court Remanded Jagajyoti

14 Days Remanded for Jagajyoti Bribery Case: లంచ తీసుకుంటూ దొరికిపోయిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతికి నాంపల్లి ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఆమె కాంట్రాక్టర్ నుంచి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేశారు. తొలుత ఆమెకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.


ఏసీబీ అధికారులు జగజ్యోతిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు . దీంతో నిందితురాలిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరోవైపు లంచం కేసులో పట్టిబడిన వెంటనే జగజ్యోతి ఆస్తులపై ఏసీబీ అధికారులు దృష్టిపెట్టారు. మంగళవారం ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.65 లక్షల 50 వేల నగదు లభ్యమైంది. అలాగే మూడున్నర కిలోలకుపైగా బంగారం దొరికింది. ప్లాట్లు, వ్యవసాయ భూములకు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.


జగజ్యోతికి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమెను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీ విచారణలో నిందితురాలి నుంచి మరిన్ని వివరాలు సేకరించనున్నారు.అప్పుడు ఆస్తుల చిట్టా జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×