Nalgonda Car Accident : నల్లగొండ జిల్లా ఇనుపాముల స్టేజ్ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి కారు బూడిదైంది.
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.