Nagole Crime : హైదరాబాద్ లోని నాగోల్ పరిధిలో ఆదివారం సాయంత్రం అదృశ్యమైన బాలుడు శవమై కనిపించాడు. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. 12 ఏళ్ల మనీష్ ఆదివారం కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం ఓ క్వారీ గుంతలో అతని మృతదేహం లభ్యమైంది. మనీష్ మరణంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఇద్దరు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి చనిపోయాడని అతని మిత్రులు చెప్తున్నారు. భయపడిపోయి మనీష్ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మనీష్ తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మనీష్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వాళ్లను పిలిచి అడగ్గా అసలు విషయం బయటపడింది. క్వారీ గుంత నుంచి మనీష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.