EPAPER

Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. పోటాపోటీగా కేసులు..

Nagarjuna Sagar Dam : నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం.. పోటాపోటీగా కేసులు..

Nagarjuna Sagar Dam : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వివాదం మరింత ముదిరింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా కేసులు పెట్టుకున్నాయి. తమపై దాడి చేసి నాగార్జునసాగర్ డ్యామ్‌పైకి అక్రమంగా చొరబడ్డారని ఏపీ పోలీసులపై అక్కడ భద్రతగా ఉన్న తెలంగాణ పోలీస్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అలాగే అనుమతి లేకుండా నాగార్జున సాగర్ నీటిని విడుదల చేశారని ఏపీ ఇరిగేషన్ అధికారులపై కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై నాగార్జునసాగర్‌ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.


మరోవైపు తాజాగా తెలంగాణ పోలీసులపై కూడా ఏపీ నీటిపారుదల అధికారులు ఫిర్యాదు చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ విధులను అడ్డుకున్నారని ఆరోపించారు. దీనిపై విజయపురి దక్షిణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ నీటిపారుదలశాఖ అధికారుల ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులపై విజయపురి స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. కృష్ణా జలాల పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం ఏర్పడింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాల అధికారులు పోటాపోటీగా కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత హీటెక్కింది.


Tags

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×