Hyderabad : హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఫిలింనగర్లో అర్థరాత్రి గౌస్ మొయినుద్దీన్ హత్య జరిగింది. ఇటీవలే యూకే నుంచి హైదరాబాద్కు వచ్చిన హస్సేన్.. కత్తితో గౌస్ను హత్య చేశాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ మర్డర్ జరిగినట్టు భావిస్తున్నారు.
గతంలో ఫిల్మ్ నగర్ పోలీసులకు వివాహేతర సంబంధం గురించి గౌస్ మొయినుద్దీన్ పిర్యాదు చేసినట్లు సమాచారం. గౌస్ భార్యకు యూకేలో హుస్సేన్ పరిచయమైనట్లు తెలిసింది . యూకేలో ఇద్దరు షేరింగ్ రూంలో ఉన్నారు. ఈ సన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గౌస్ అడ్డును తొలగించుకోవాలని హుస్సేన్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.