RagunandanRao Vs KTR: మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హైడ్రా నెక్ట్స్ టార్గెట్.. లోటస్పాండ్.. జగన్ ఇంటిని కూడా..
నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందన్నారు. అయినా కూడా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూలగొట్టలేదని ఆయన అన్నారు. చెరువులు ఎక్కడెక్కడా కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా? అంటూ రఘనందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారంటూ ఆయన విమర్శించారు.
Also Read: హీరో నాగార్జునకు షాక్.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చేసిన హైడ్రా