MP Aravind And Bandi Sanjay Reaction : బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నేతల దాడి పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఈ సంఘటనపై ఎంపీ అరవింద్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఇంటిపై దాడి చేసిన దృష్యాలను ట్విట్టర్లో ఎంపీ అరవింద్ పోస్ట్ చేస్తూ.. కేటీఆర్, కవితపై ఫైర్ అయ్యారు.
మా అమ్మను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు. హైదరాబాద్లోని నా ఇంటిపై కవిత, కేటీఆర్ ఆదేశాలతోనే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారన్నారు. దమ్ముంటే కవిత 2024లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్ధిగా తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కవిత రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చిందని అందుకే ఇలా తెగించి దాడులకు దిగుతున్నారన్నారు.
ఇక ఈ దాడిపై బండి సంజయ్ మాట్లాడుతూ.. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దద్దమ్మలు ఇంటిపై అటాక్ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదని బండి సంజయ్ హెచ్చరించారు.