EPAPER

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..

Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. కొడుకులు చనిపోయిన గంటల వ్యవధిలోనే వారి తల్లులు సైతం గుండెపోటుతో మరణించారు. ప్రాంతాలు వేరైనా.. గుండెపోటుకు గురై నలుగురు మృతి చెందడంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.


మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గుండెపోటుతో తల్లీ, కొడుకు మృతి చెందారు. ఈ ఘటన హవేలి ఘనపుర్ మండలం కూచన్ పల్లిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. కొడుకు మరణవార్త విన్న తల్లి లక్ష్మి.. గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏపీలోని చిత్తూరు నగరంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చిత్తూరు నగరంలో కూమారుడు మరణించాడని తల్లి అవేదనతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. నగరంలోని కట్టమంచికి చెందిన సురేంద్రరెడ్డి(58) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించాడు. కుమారుడుడిని అచేనంతగా చూసిన తల్లి సుశీలమ్మ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడి మృతి.. తట్టుకోలేక షాక్ గురై మరణించిందని డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరు తల్లులు, ఇద్దరు కొడుకుల మరణాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×