EPAPER
Kirrak Couples Episode 1

Modi Speech in Maheshwaram : స్కీమ్‌లన్నీ స్కామ్‌లే.. కేసీఆర్‌పై మోదీ ఫైర్!

Modi Speech in Maheshwaram : స్కీమ్‌లన్నీ స్కామ్‌లే.. కేసీఆర్‌పై మోదీ ఫైర్!

Modi Speech in Maheshwaram : ప్రధాని మోదీ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మహేశ్వరంలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఉపఎన్నికల్లో, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఓడించెందవరు? అని ప్రశ్నించారు.


కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్ లో మొదలైందని మోదీ గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు బీఆర్ఎస్ కే వెళుతుందన్నారు. కాంగ్రెస్ కు అన్ని అంశాల్లో కేసీఆర్ మద్దతిచ్చారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బంధం ఈనాటిది కాదన్నారు. మాదిగ సామాజికవర్గానికి న్యాయం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జీతాలు, పింఛన్లు సరైన సమయానికి ఇవ్వడంలేదని విమర్శించారు.

తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలమని మోదీ కితాబిచ్చారు. బీఆర్ఎస్ అవినీతి వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రాలేదన్నారు. బీఆర్ఎస్,కాంగ్రెస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. గులాబీ పార్టీని దుబ్బాక, హుజూరాబాద్‌, జీహెచ్‌ఎంసీలో ప్రజలు తిప్పికొట్టారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ స్కీమ్ లన్నీ స్కామ్ లేనని మోదీ విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందన్నారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×