Modi Manki Baat : ప్రధాని నోట సిరిసిల్ల నేతన్న మాట వచ్చింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని చేతిలో సిరిసిల్ల చేనేత వస్త్రం తళుక్కున మెరిసింది. చేనేత కార్మికుడు హరి ప్రసాద్ జీ-20 పేరుతో చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని మోదీ చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించారు. మన్ కీ బాత్ లో ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆసక్తిగా తిలకించారు.