MLC Jeevan Reddy : టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు వెంటనే ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసైను రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై ఆయన గవర్నర్ కు లేఖ రాశారు. నెల రోజులు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు.
నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీ బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని జీవన్ రెడ్డి తెలిపారు.