Telangana Congress MLC : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన ఇద్దరు నేతలు.. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేశారు.
అద్దంకి దయాకర్ 2014, 2018 అసెంబీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి.. రెండు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించనప్పటికీ.. అధిష్టానం ఆ సీటును మందుల సామేల్కు కేటాయించింది. మందుల సామేల్ గెలుపుకు అద్దంకి దయాకర్ ఎంతో కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేశిన అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది.
బల్మూరి వెంకట్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా చురుగ్గా పని చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ సంపాదించి ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది.