Miyapur : మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసులో చికిత్స పొందుతున్న యువతి తల్లి శోభ మృతి చెందింది. మంగళవారం మియాపూర్లో యువతిపై ప్రేమోన్మాది సందీప్ కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన యువతి తల్లి శోభపైనా అటాక్ చేశాడు. అనంతరం తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలైన తల్లి శోభ ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతిది రేపల్లె, బాపట్ల జిల్లా. తన స్వగ్రామంలో సందీప్ అనే యువకుడితో పరిచయమైంది, ఇద్దరు స్నేహంగా మెలిగారు. యువతి సోదరుడికి ఉద్యోగం రావడంతో బాపట్ల నుంచి హైదరాబాద్ మియాపూర్కు షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోమని యువతిని సందీప్ వేధించసాగాడు.
యువతి ఎన్ని సార్లు వద్దని చెప్పినా వినలేదు. మంగళవారం యువతి ఇంటికి వెళ్లిన సందీప్ మళ్లీ పెళ్లి ప్రస్తావణ తీసుకొచ్చాడు. ఈ విషయంతో కొంత గొడవ జరిగింది. సందీప్ వెంట తెచ్చుకున్న కత్తితో యువతి పై దాడి చేశాడు. అడ్డు వచ్చిన యువతి తల్లిపైనా కూడా దారుణంగా కత్తితో తెగబడ్డాడు. ఆ తరువాత తనను తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.