Minister Uttam Kumar Reddy Key Comments: మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు అంటూ మంత్రి పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని జడ్చర్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కిష్టాపురంలో ఉన్న ఉదండాపూర్ జలాశయాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇది మీకు తగునా.. బిఆర్ఎస్ పై నెటిజన్స్ కామెంట్స్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదంటూ మంత్రి ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు రూ. 45 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను కూడా ఆయన పరిశీలించారు.
Also Read: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్పై కేటీఆర్ కామెంట్స్.. 10 యేండ్ల పాటు…