Minister Uttam Kumar Reddy: గత ప్రభుత్వంలో ఉన్న నేతలు, అధికారుల అండదండలతోనే రేషన్ రీసైక్లింగ్ జరిగిందన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రేషన్ దుకాణాలను పరిశీలించిన అనంతరం అక్కడ వారితో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యాన్ని చాలా వ్యయంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఎవరైనా రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు.. 3 వేల 300 కోట్లు ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కార్పొరేషన్ను ముందు ముందు నడపాలంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి. ఏ సెక్యూరిటీ లేకుండా విలువైన పాడిని 22 వేల కోట్లు మిల్లర్ల దగ్గర సివిల్ సప్లై పెట్టిందని వెల్లడించారు.
చాలా సమర్ధత రాజకీయదురుద్దేశంతో సివిల్ సప్లై కార్పొరేషన్ నడిపించారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లైలో ప్రస్తుతం ఉన్న విధానాలను మార్పు చేస్తామని మంత్రి వెల్లడించారు.