Minister Ponnam Comments: కుల గణనకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు హక్కులను సాధించుకోవాలని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఓబీసీ అడ్వకేట్స్ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
Also Read: మిత్రులకు ఫాంహౌస్లు ఉన్నా కూల్చేవేతలే..సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీసీల పాత్ర మరువలేనిదన్నారు. ఈ విషయంలో అందరినీ అభినందిస్తున్నానంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మన హక్కులను మనం అడగాలన్నారు. ఈ సమావేశంలో లేవనెత్తిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన పేర్కొన్నారు. కుల గణన చేస్తామంటూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు చెప్పానని గుర్తుచేశారు. ‘మళ్లీ చెబుతున్నాను.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలహీనవర్గాల న్యాయవాదులు ఏకం కావాలి. జీవితం సార్థకం కావాలంటే మనం మన హక్కుల కోసం పోరాడాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు.