EPAPER

Ponguleti Serious on KCR: ధరణి పేరుతో పెద్దాయన మోసం చేశారు: మంత్రి పొంగులేటి

Ponguleti Serious on KCR: ధరణి పేరుతో పెద్దాయన మోసం చేశారు: మంత్రి పొంగులేటి

Ponguleti Serious Comments on KCR(Telangana politics): మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో భూసంస్కరణలు, ధరణిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసంస్కరణలకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారంటూ ఆయన గుర్తు చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు కూడా భూసంస్కరణలు చేశారని ఆయన అన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన భూదాన ఉద్యమం తెలంగాణలోనే పుట్టిందని మంత్రి పేర్కొన్నారు. 1973లో కాంగ్రెస్ ప్రభుత్వం సీలింగ్ చట్టం తెచ్చిందని, ఈ చట్టంతోనే పేదలకు భూములు పంచారని ఆయన చెప్పారు. వైఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారంటూ మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.


ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కేసీఆర్ పై మండిపడ్డారు. గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న చాలామంది కూడా భూసంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్నారని ఆయన అన్నారు. అయితే, రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయన్నారు.

Also Read: రెనెన్యూ రాబడులు పెరిగాయి: కాగ్


‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ లోపభూయిష్టంగా ఉన్నది. ధరణి తెచ్చిన సమస్యల వల్ల పేద రైతులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ధరణి పేరుతో అప్పటి పెద్దాయన ప్రజలను మోసం చేశారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు’ అంటూ మంత్రి పొంగులేటి ఫైరయ్యారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×