EPAPER

Revanth Reddy: 20 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డే.. కేసీఆర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

Revanth Reddy: 20 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డే.. కేసీఆర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkatreddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ఉప్పల్ – ఘట్కేసర్ ఫ్లై ఓపర్ పనులు పరిశీలించారు. ఆరేళ్లుగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. పనుల జాప్యంపై ఆర్ అండ్ బీ అధికారులపై సీరియస్ అయ్యారు. నెపాన్ని కాంట్రాక్టర్ల మీదికో, జీహెచ్ఎంసీ మీదికో నెట్టేయడం సరికాదని, ఎక్కువ సమయం వీటికే కేటాయించాలని మంత్రి ఫైర్ అయ్యారు.


అదే సందర్భంలో అక్కడి నుంచి కాంట్రాక్టర్ గాయత్రి కన్‌స్ట్రక్షన్ ఓనర్ సుబ్బిరాం రెడ్డి కొడుకు సందీప్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఫ్లై ఓవర్ పనుల కంటే ముందుగా కింద ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఫ్లై ఓవర్ పనుల కంటే ముందు కింద ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించగా.. అందుకు సందీప్ రెడ్డి అంగీకరించారు. ఆగస్టు 15 నుంచి మొదటగా ఉప్పల్ నుంచి నారపల్లి వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. బీటీ రోడ్డు పనులు పూర్తయితే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి.

సెప్టెంబర్ చివరినాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం టెండర్లు పిలవానలి మంత్రి ఆదేశించారు. నవంబర్ 1వ తేదీన అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని వివరించారు. మూడు నెలల్లో హైదరాబాద్ – విజయవాడ ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 175 కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జీ నిర్మించి సెల్ఫీలు దిగితే సరిపోతుందా? అని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.


తెలంగాణ అలా రాలేదు..

కేసీఆర్ లాంటి సన్నాసి వల్ల తెలంగాణ రాలేదని, తన లాంటి వాళ్లు పదవులకు రాజీనామా చేసినందుకే వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బిడ్డ జైలుకు పోయిందన్న ఫ్రస్ట్రేషన్‌లో కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ఎమ్మెల్యే పదవి ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ఆందోళనలకే ప్రాధాన్యత ఇచ్చారని, చర్చను పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో 65 గంటల్లో 45 గంటలు ప్రతిపక్షాలకే ఇచ్చామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత.. మంత్రి పదవి కోసమే గులాబీ గూటిలో చేరారని ఆరోపించారు.

Also Read: సెమీస్‌లో ఓడిన లక్ష్యసేన్.. కాంస్యంపై ఆశలు సజీవం

అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి

రాష్ట్రంలో 20 ఏళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అసెంబ్లీ స్థానాలు 175కు పెరిగే ఛాన్స్ ఉన్నదని, పెరిగితే అందులో తాము 135 సీట్లు గెలుచుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×