Telangana Election Results : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం హవా తగ్గిందా? ఈసారి సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడం కష్టమేనా? రెండు సిట్టింగ్ స్థానాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చార్మినార్ లో మాత్రం ఎంఐఎం పట్టు నిలుపుకుంది. తొలుత ఇక్కడ బీజేపీ లీడ్ సాధించినా తర్వాత ఎంఐఎం పుంజుకుంది. చివరికి ఆ పార్టీ అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ.. బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై విజయం సాధించారు.
2018లో ఆ పార్టీ 7 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు మాత్రం నాంపల్లి, మలక్ పేట్ లో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మిగిలిన సిట్టింగ్ స్థానాలు మాత్రం నిలుపుకునే అవకాశం ఉంది.