Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రతిపాదనలను ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలొ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మునుపటి ప్రాతిపాదనల్లో భాగంగా 5 కారిడార్లలో 70 కిలో మీటర్ల మేర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజా సవరింపుతో అది 78.4 కిలో మీటర్లకు చేరుకుంది. అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 24, 042 కోట్లకు చేరుకుంది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ దూరం, అంచనా వ్యాయాలు పెరిగాయి. రాజదుర్గం నుంచి విప్రో కూడలి , ఫైనాన్షయల్ డిస్ట్రిక్లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని మొదట ప్రాతిపాదించారు. దీన్ని కోకాపేట్ నియోపోలీస్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కిలో మీటర్లకు పైగా దూరం పెరిగింది. ఈ కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. మెట్రో డిపో కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్ది రోజుల క్రిందట పరిశీలించారు.