Medak : మెదక్ జిల్లా చందంపేట యువకుడి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే ఉంది. రెండు రోజులైనా యువకుడు ఆచూకీ దొరకలేదు. ప్రేమ వ్యవహారమే సురేష్ మిస్సింగ్ కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కొడుకు మిస్సింగ్ తో తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ చిన్న శంకరంపేట పీఎస్ ముందు ధర్నాకు దిగారు. సురేష్ ను చంపేశారని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల కిందట ఓ యువతి కాల్ చేస్తే ఆమె ఇంటికి వెళ్లాడని తెలిసింది. దీన్ని గమనించిన యువతి తల్లిదండ్రులు సురేష్ ను కొట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడై బైక్, సెల్ ఫోన్ వదిలేసి పారిపోయాడు సురేష్. అలా వెళ్లిన సురేష్ ఇంకా కన్పించలేదు.