Marri shashidharreddy : కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకే ఢిల్లీకి వెళ్లినట్లు వెల్లడించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన వెంట ఉన్నారన్న వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చిన విమానంలో చాలా పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానని ప్రచారం చేయడం తగదన్నారు.
మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు గతంలో వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ టూర్ వ్యక్తిగత పర్యటన అని మర్రి శశిధర్ రెడ్డే క్లారిటీ ఇచ్చి ..బీజేపీలో చేరతారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు.