Telangana- Chhattisgarh : తెలంగాణ -ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మావోయిస్టులు మూడు బేస్ క్యాంపులపై కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డట్లు సమాచారం.
Telangana- Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు.. మూడు బేస్ క్యాంపులపై కాల్పులు జరిపారు. బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డట్లు సమాచారం.
చింతవాగులోని పామేడులోని 204, కోబ్రా బెటాలియన్,సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్, ధర్మారంలోని 151 బెటాలియన్ క్యాంపులపై గ్రనేడ్లు, రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. ఈ దాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీనిపై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఆరా తీస్తున్నారు.