Manikonda polling violence : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లోని మణికొండ పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Manikonda polling violence : తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లోని మణికొండ పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పోలింగ్ బూత్ దగ్గర కొందరు నాయకులు అనుచరులతో కలిసి విధ్వంసం చేశారు. రెండు ప్రధాన పార్టీ నాయకుల మధ్య జరిగిన గొడవలో పోలింగ్ బూత్ వద్ద టేబుళ్లు, కుర్చీలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పోలింగ్ బూత్ కు సమీపంలో ఒక పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ స్థానికులు ఆరోపణలు చేశారు. దీంతో మరో పార్టీ నేత, ఆయన అనుచరులు గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
దుర్బషలాడుతూ.. ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. ఈ దాడిలో పోలింగ్ బూత్ దగ్గర ఉన్న కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం అయ్యాయి. పోలీసులు కలుగజేసుకున్నా వారు వినకపోవడంతో.. పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీచార్జ్ చేశారు.