కేటీఆర్కు కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ లీగలు నోటీసులు పంపారు. సీఎం పదవి కోసం మాణిక్కం ఠాగూర్కు రేవంత్రెడ్డి 50 కోట్లు లంచం ఇచ్చారంటూ ఇటీవల కేటీఆర్ ఆరోపించారు. దీంతో.. ఆయనకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా ఠాగూర్ వెల్లడించారు.
జనవరి 28న సిరిసిల్లలో జరిగిన సభలో.. మేనేజ్మెంట్ కోటాలో సీఎం అయిన వ్యక్తి రేవంత్రెడ్డి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఠాగూర్.. ఎమ్మెల్యేల తీర్మానంతో రేవంత్ సీఎం అయ్యారన్నారు.కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే తన పేరును ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.