Adilabad: పట్టపగలు.. నడిరోడ్డుపై హత్య. అదీ.. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికేశారు. ఇదేదో సినిమాకు సంబంధించిన కథ కాదు. ఆదిలాబాద్లో జరిగిన ఘటన ఇది.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఉదయం 10 గంటల సమయంలో దారుణ హత్య జరిగింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఈశ్వర్ అనే వ్యక్తిని.. ఇద్దరు దుండగులు.. కొడవళ్లు, కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. హత్య చేసినంతరం స్థానిక పోలిస్ స్టేషన్లో ఇద్దరు నిందితులూ లొంగిపోయారు. హత్య చేసిన ప్రదేశంలో సీసీ కెమెరా ఉండటంతో వీడియో రికార్డు అయ్యింది.
హత్యకు గురైన యువకుడిని ఈశ్వర్ గా గుర్తించారు. మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటాడని స్థానికులు తెలిపారు. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.