Mallu Ravi : ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. డప్పు వాయిద్యాలతో తెలంగాణ భవన్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లు రవి తొలు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. స్టూడెంట్ లీడర్ గా మొదలుపెట్టి ఎంపీ స్థాయికి ఎదిగారు. 1991-96, 98-99 మధ్య నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేశారు. ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇటీవల మల్లు రవిని సీఎం రేవంత్రెడ్డి నియమించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు.
ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన ఏఐసీసీ పెద్దలకు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. 15
అంశాలపై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని వివరించారు.సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మల్లు రవి కోరారు.