Mallu Bhatti Vikramarka news(Latest political news telangana):
మధిర నియోజకవర్గం పేరు చెబితే గుర్తొచ్చే నాయకుడు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించి తన సత్తా చాటారు. ఇప్పుడు నాలుగోసారి విజయంపై కన్నేశారు. 2009లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారిన తర్వాత ఇక్కడ నుంచే భట్టి విక్రమార్కే వరుసగా గెలుస్తున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయనే విజేతగా నిలిచారు.
ఇప్పుడు మధిరలో నాలుగోసారి విజయంపై భట్టి విక్రమార్క కన్నేశారు. ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సీపీఐ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రచారంలో ఆయన వెంట తిరుగుతున్నారు.
పీపుల్స్ మార్చ్ ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. సంపన్న రాష్ట్రాంలో పేదలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లతోనే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపుతోనే బీఆర్ఎస్ అవినీతి పాలనకు చెక్ పడుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
.
.