Mallareddy : ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి హాజరుకాలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యులు, మల్లారెడ్డి సంస్థల్లో పనిచేస్తున్న వారు మొత్తం 10 విచారణకు హాజరయ్యారు. వారిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఐటీ అధికారులకు సహకరిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఉప్పల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తనను ఐటీ వాళ్లు వదిలిన మీడియా వాళ్లు మాత్రం వదలడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఐటీ విచారణపై తానిప్పుడే ఏం మాట్లాడలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున తాను ఐటీ విచారణకు హాజరుకాలేదన్నారు. తన తరఫున ఆడిటర్ ను పంపానని తెలిపారు.
ఐటీ విచారణకు సహకరిస్తానని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితమే తనకు సమన్లు అందాయని తెలిపారు. ఐటీ అధికారులకు అన్ని విధాల సహకరిస్తానని వెల్లడించారు.
మల్లారెడ్డి తో సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. వారందరినీ సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. ఐటీ సోదాల్లో లభ్యమైన కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన వివరాలు తీసుకురావాలని కోరారు. దీంతో నోటీసులు అందుకున్న వారిలో 10 ఐటీ విచారణకు హాజరయ్యారు.
ఐటీ విచారణకు హాజరైన వ్యక్తులు
1.మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్లారెడ్డి అల్లుడు