Mallareddy IT Raids Updates : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని… ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం ప్రశ్నించనున్నారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలంటూ… ఇప్పటికే మల్లారెడ్డితో పాటు 16 మందికి నోటీసులు జారీ చేశారు. విద్యాసంస్థల్లో డోనేషన్లపై ప్రధానంగా ఆరా తీసే అవకాశముందని తెలుస్తోంది.
రెండు రోజుల పాటు మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రెండు వందల మందికిపైగా ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి రెండు రోజుల పాటు తనఖీలు నిర్వహించారు. దాదాపు 18 కోట్ల 50 లక్షలు నగదు, 15కేజీల బంగారం, కీలక పత్రాలు సీజ్ చేశారు. వీటికి సంబంధించి మల్లారెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించనున్నారు.
మరోవైపు… ఐటీ దాడుల్ని మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఖండించారు. కర్కశంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే దాడులు జరిగినట్లుగా అనిపిస్తుందని చెప్పారు. ఐటీ అధికారులపై పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులూ…. దుండిగల్ పీఎస్లో మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు.
2024లో దిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దిల్లీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాలంటీర్గా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామన్నారు