Malkajgiri : డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాచారం పీఎస్ పరిధిలో కల్తీ కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టును మల్కాజ్గిరి ఎస్ఓటీ, నాచారం పోలీసులు రట్టు చేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్ పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడ కుల్ఫీ, ఫలుదా తయారీ విధానం చూసి విస్తుపోయారు. తయారీ కోసం వాడుతున్న ఎక్స్పైర్ అయిన రసాయనాలు, కుళ్లిపోయిన బాదం గింజలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ కు చెందిన రోషన్ లాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో.. డ్రమ్ముల్లో పానకం నిల్వ ఉంచి ఆ పానకంతో కుల్ఫీలను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీం లు తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎక్కడపడితే అక్కడ తక్కువకే ఐస్ క్రీమ్ లు, ఫలుదాలు వస్తున్నాయని తినరాదని హెచ్చరించారు.