Mahabubnagar Crimes : పాలమూరు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కామాంధుల అఘాయిత్యానికి మరో బాలిక బలి అయింది. సొంత బాబాయే కాలయముడిగా మారిపోయాడు. వరుసకు బిడ్డ అయిన బాలికపై అత్యాచారం చేసి అనంతరం చంపేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా ఉన్నారు. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ శ్రీనివాస్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మృతురాలు బాబాయ్ శ్రీనివాస్ తదితరులు ఆ ఇంటికి వెళ్లి బాలికపై అత్యాచారం జరిపారు. దీంతో బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప ఆధ్వర్యంలో బాలానగర్ ఎస్సై జయప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు