Love: ఇద్దరు లవర్స్ కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలోనే అబ్బాయికి మరో అమ్మాయి మెసేజ్ చేసింది. దీంతో ఆమెకు కోపం వచ్చింది. నన్ను ప్రేమిస్తూ.. మరో అమ్మాయితో మాట్లాడుతావా అంటూ గొడవ పడింది. కోపంతో ఇంటికి వెళ్లింది. ఎవరూ లేనిది చూసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పరిధిలో చోటుచేసుకుంది.
శ్రీనివాస్నగర్లో ఉండే సాయితేజకు అదే కాలనీకి చెందిన 15 ఏళ్ల వయస్సు గత తొమ్మిదో తరగతి విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అదికాస్త ప్రేమగా మారింది. సోమవారం మధ్యాహ్నం వారిద్దరూ జగద్గిరిగుట్టలో కలుసుకున్నారు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత సాయితేజ వాట్సాప్కు ఓ యువతి మెసేజ్ చేసింది. అదే మెసేజ్ వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది.
నన్ను ప్రేమిస్తూ మరో అమ్మాయితో మాట్లాడుతున్నావని సాయితేజతో గొడవపడింది. అలిగి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆవేశంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఆమె తల్లి ఇంటికొచ్చి చూసే సరికి అప్పటికే మృతి చెందింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.