Nizamabad: నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక లారీ బీభత్సం సృష్టించింది. ఫుల్లుగా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టాడు. దాంతో లారీ, కారు టోల్ ప్లాజ్ కౌంటర్లోకి దూసుకెళ్లాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. టోల్ ప్లాజాలో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.