Higher Education : రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా ఆచార్య ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్గా వి.వెంకటరమణ కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు వీరినీ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 10న జీఓ జారీ చేసింది. అయితే ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో చేసింది. మళ్లీ వారే కొనసాగాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా ఆచార్య ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్గా వి.వెంకటరమణ కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు వీరినీ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 10న జీఓ జారీ చేసింది. అయితే ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో చేసింది. మళ్లీ వారే కొనసాగాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జీఓ 96 జారీ చేశారు. 2021 ఆగస్టు 25 నుంచి ఆచార్య లింబాద్రి ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్గా ఉండగా, 2023 జూన్ 26 నుంచి రెగ్యులర్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన్ను మూడేళ్లపాటు పదవీలో కొనసాగాలని గత జూన్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.