Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై ప్రముఖ లాయర్ రాపోలు భాస్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయటం ద్వారా.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
Kaleswaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై ప్రముఖ లాయర్ రాపోలు భాస్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయటం ద్వారా.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కవితతోపాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు భాస్కర్. వీరితోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని కోరారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఏసిబీ అధికారులను కోరారు.