Monsoon news in telangana(Morning news today telugu): తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు.. వాతావరణశాఖ అతి భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయంటూ.. హెచ్చరికలు జారీ చేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఆయాచోట్ల 115 మిల్లీ మీటర్ల నుంచి 200 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. మరో 7 జిల్లాల్లో 65 నుంచి 115 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని సూచించింది.
రుతుపవనాలకు తోడు.. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో.. ఆవర్తనం కొనసాగుతున్న కారణంగానే అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.