KTR : ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పక్కవారికి ఎక్కువగా వస్తుందన్న బాధ కొందరికి ఎక్కువైందన్నారు.ఈ అంశం తమకు దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ఐదు ఎకరాల లిమిట్ విధించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే కోతపై ఆలోచన చేస్తామన్నారు.
రైతుబంధుకు కోత విధించే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.