EPAPER

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిజాం కాలేజ్‌ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.


హాస్టల్‌ వసతి అంశంపై ఇటీవల బషీర్‌బాగ్‌ కూడలిలో విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ ఛాంబర్‌లోనూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని అటు విద్యాశాఖ మంత్రిని, ఇటు ప్రిన్సిపల్ ను ఆదేశించారు.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×