EPAPER
Kirrak Couples Episode 1

KTR : జగ్గారెడ్డితో కేటీఆర్ భేటీ .. ఈటలతో ముచ్చట్లు.. ఏంటీ సంగతి..?

KTR : జగ్గారెడ్డితో కేటీఆర్ భేటీ .. ఈటలతో ముచ్చట్లు.. ఏంటీ సంగతి..?

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రి కేటీఆర్‌తో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. కేటీఆర్‌ చాంబర్‌కు వెళ్లి కాసేపు ముచ్చటించారు. అసలు జగ్గారెడ్డి కేటీఆర్‌ చాంబర్‌కు ఎందుకు వెళ్లారు? ఆయన మళ్లీ కాంగ్రెస్‌ అధిష్టానంపై అలిగారా? లేక నియోజకవర్గ సమస్యలపై చర్చించడానికి వెళ్లారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.


కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. పిల్లలతో కలిసి తిరిగితే ఎలా అని కేటీఆర్ అన్నారు. టీ షర్టుతో వస్తే తప్పు లేదని జగ్గారెడ్డి అన్నారు. ఆ సమయంలో జగ్గారెడ్డితో TNGO అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉన్నారు. మీ ఇద్దరికీ స్నేహం ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు. మాది ఒకే కంచం ఒకే మంచం అని మామిళ్ల సమాధానం ఇచ్చారు. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని మామిళ్ల స్పష్టం చేశారు. అయితే మన దగ్గరకు పట్టుకొస్తామంటూ ఆసక్తికర కామెంట్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్ద కేటీఆర్ వెళ్లారు. ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలోఇరువురు నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. 10 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. వారిద్దర మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే చర్చ నడుస్తోంది.


Related News

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Big Stories

×