KTR: ఆ నెటిజన్ ట్వీట్ కు ఏకీభవిస్తున్న.. కేటీఆర్ కీలక వ్యాఖ్య..
KTR : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటం సులభమయ్యేది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారని పేర్కొన్నారు. ఆ నెటిజన్ పరిశీలనతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలకు కౌంటర్ గా ఇటీవల స్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ముఖ్యంగా యూ ట్యూబ్ లో ప్రత్యర్థుల అసత్య ప్రచారాలను తిప్పకొట్టడంలో తాము విఫలం అయినట్లు ఒప్పుకున్నారు.