KRMB Three Member Committee: వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చర్చించాయి. ఈ నీటి కేటాయింపులపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది.
నాగార్జున సాగర్ లోని 14 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు ఈ కమిటీల కేటాయించింది. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేఆర్ఎంబీ కమిటీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశంలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమీటీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. మే నెలలో కేఆర్ఎంబీ మరోసారి ఈ కేటాయింపుల విషయంలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపులపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ జలశౌధలో నిర్వహించారు.
తమకు మరో ఐదు టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణకు అదనంగా 7 టీఎంసీల నీటిని వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ పేర్కొంది. సాగర్ నుంచి వెంటనే తమకు రావాల్సిన 5 టీఎంసీల నీటిని ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేసింది.