Dharmapuri :ధర్మపురి నియోజకవర్గంలో 2,24, 724 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,09, 963 మంది, మహిళా ఓటర్లు 1,14, 622 మంది ఉన్నారు. ప్రస్తుతం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 ( 19-08-23)..
అప్పడు చేసిన సర్వేలో కాంగ్రెస్ కు 45 శాతం, బీఆర్ఎస్ కు 43 శాతం , బీజేపీకి 8 శాతం ఓట్లు వస్తాయని తేలింది.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (19-08-23)..
తాజాగా చేసిన సర్వేలో కాంగ్రెస్ కు 48 శాతం, బీఆర్ఎస్ 43 శాతం, బీజేపీకి 6శాతం ఓట్లు పడతాయని వెల్లడైంది.
ఓటరు నాడీ మారుతోందా?..
రెండు సర్వేల్లో బీఆర్ఎస్ సాధించే ఓట్ల శాతంలో మార్పులేదు. కానీ కాంగ్రెస్ కు 3 శాతం ఓట్లు ఇంకా పెరుగుతాయని తేలింది. అదే సమయంలో గత సర్వే కంటే ఇప్పుడు బీజేపీ ఓట్లు రెండుశాతం తగ్గాయని వెల్లడైంది.
మొత్తంమీద చూస్తే ధర్మపురిలో కాంగ్రెస్ గెలుస్తుందనే అభిప్రాయం ఓటర్ల నుంచి వ్యక్తమవుతోంది.
.
.